మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన నాగబాబు ట్వీట్ | అల్లు అర్జునే టార్గెట్? |Allu Arjun | Boldbalu TV

మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన నాగబాబు ట్వీట్ | అల్లు అర్జునే టార్గెట్? |Allu Arjun | Boldbalu TV



[matched_content]

#alluarjun #pushpa #boldbalutv

Pls Subscribe Boldbalu TV

ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో మళ్లీ చిచ్చుపెట్టాయి. గతంలో కూడా ఈ గొడవలు ఉన్నా ఈసారి అవి స్పష్టమైన విభజన రేఖను గీసేశాయి. అల్లు వారి ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య పొలిటికల్ గోడలు కట్టేశాయి.

తాజాగా నాగబాబు వేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. బన్నీ పేరెత్తకుండానే నాగబాబు ఘాటు ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. స్టార్ హీరో భార్య హీరోయిన్లకు తలనొప్పిలా మారారనేది ఆ వార్త సారాంశం. తెలుగు సినీ పరిశ్రమలో ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు.

వివాహమై ఇద్దరు పిల్లలున్నారంటే నమ్మడం కష్టమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అచ్చం కాలేజీకి వెళ్లే అమ్మాయికలా కనిపిస్తోందంటున్నారు. చాలామంది హీరోయిన్ల కన్నా స్నేహారెడ్డి బాగుందని, సినిమాల్లోకి వస్తే బాగుంటందంటున్నారు. ఆమెను చూసి నేర్చుకోండంటూ హీరోయిన్లకు సలహానిస్తున్నారు. ఇలా మిగతా హీరోయిన్లకు పెద్ద తలనొప్పిలా మారిపోయింది. స్నేహ అందం చూసి కొందరు అసూయ పడుతుంటే మరికొందరు పెదవి విరుస్తున్నారు.

అల్లు అర్జున్, స్నేహ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. వారి ఆలనా పాలనా వీరిద్దరూ దగ్గరుండి చూసుకుంటారు. పిల్లలను గారాబం చేయకూడదని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిని అవసరమైతే కఠినంగానే దండించాలని స్నేహారెడ్డి బన్నీతో గొడవ పెట్టుకుంటుంది. తాజాగా ఈ విషయంమీదే ఇద్దరూ చిన్నపాటి గొడవ పడినట్లు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేసింది. పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న బన్నీకి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఈ సినిమాను దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా విడుదల చేయడానికి నిర్మాత, దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే బన్నీ మైనపు విగ్రహాన్ని టుస్సాడ్ మ్యూజియంలో ఆవిష్కరించారు. జర్మనీలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కు భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు.

చాలా అన్యోన్యంగా ఉండే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి ..ఆ ఒక్క విషయంలో మాత్రమే బాగా గొడవపడతారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . స్టార్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది .. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ..మరి కొంతమంది అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్లను గాఢంగా ప్రేమించి ఇంట్లో చెప్పి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా సరే ఘనంగా పెళ్లి చేసుకున్నారు . ఆ లిస్ట్ లోకి వస్తారు అల్లు అర్జున్ -స్నేహ రెడ్డి ఇద్దరికీ అస్సలు టచ్ ఉండదు .

అల్లు అర్జున్ ఊర నాటు ఎనర్జీతో ఉంటాడు.. స్నేహ రెడ్డి చాలా కూల్ చాలా సైలెంట్ గా ఉంటుంది. అసలు ఆమె మాట్లాడిన సందర్భాలు మనం ఇప్పటివరకు రెండో మూడో చూసుంటే గొప్ప .. అంత సైలెంట్ అయితే వీళ్ళిద్దరికీ ఎలా మ్యాచ్ అయిందా..? అంటే అది దేవుడు నిర్ణయమే .. అదంతా ప్రేమ మాయ.. ప్రేమ ఏమైనా చేస్తుంది అంటూ ఉంటారు అభిమానులు ఈ జంట .

చాలా అన్యోన్యంగా ఉంటుంది.. చక్కగా ఫ్యామిలీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది .. అయితే ఎంత చక్కగా ఎంత ఆనందంగా ఉన్నా ఫ్యామిలీలో గొడవలు అనేటివి కామన్ . మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాలు కచ్చితంగా వస్తూనే ఉంటాయి . అయితే అల్లుఅర్జున్ స్నేహారెడ్డిల మధ్య కూడా గొడవలు వస్తాయట . మరీ ముఖ్యంగా వీళ్ళ మధ్య వచ్చే గొడవలు పిల్లల విషయంలోనే.. స్నేహ రెడ్డి పిల్లలను పడుతూ లేస్తూ పెంచాలి.. దెబ్బ తగిలితేనే వాళ్ళకి ఆ నొప్పి బాధ తెలుస్తుంది ..లైఫ్ లో స్ట్రాంగ్ అవ్వగలరు అనుకుంటుందట.

కానీ అల్లు అర్జున్ తన పిల్లలకు దెబ్బ తగిలితే చూడలేడు .. అందుకే అన్ని వాళ్ళు అడగకముందే.. అన్ని సౌకర్యాలను సమకూరుస్తాడట. ఆ విషయంలో మాత్రం స్నేహారెడ్డి అల్లు అర్జున్ డిఫరెంట్ మైండ్ సెట్. అందుకే వాళ్లకు గొడవలు వస్తూనే ఉంటాయట . ఈ మేటర్ లో తప్పిస్తే మిగతా మేటర్ లో అంతా వీళ్లిద్దరూ సూపర్ పర్ఫెక్ట్ జోడి..!!

“మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” అంటూ అల్లు అర్జున్ పేరెత్తకుండా అసలు విషయం చెప్పారు నాగబాబు.

పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లుళ్లు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. చిరంజీవి వీడియో సందేశం ఇవ్వగా, చివర్లో రామ్ చరణ్.. బాబాయ్ కోసం పిఠాపురం వచ్చారు. అయితే పవన్ కల్యాణ్ కి మద్దతుగా ట్వీట్ వేసి సరిపెట్టిన అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికోసం నంద్యాల రావడం సంచలనంగా మారింది. రావడమే కాదు, తన స్నేహితుడ్ని గెలిపించాలని కూడా బన్నీ ఓటర్లకు పిలుపునిచ్చారు. దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. జనసైనికులకు కోపం వచ్చింది.

అంతా అయిపోయాక..

అప్పటికప్పుడు అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీకి కోపం వచ్చినా బయటపడలేదు. ఇప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత నాగబాబు తెలివిగా ట్వీట్ వేశారు. ముందుగానే ఈ కోపం ప్రదర్శిస్తే బన్నీ ఫ్యాన్స్ కూటమికి షాకిచ్చే ప్రమాదం ఉంది. అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత నర్మగర్భంగా ట్వీట్ వేసి బన్నీ ఫ్యాన్స్ కి మంట పెట్టారు నాగబాబు. ఇంకేముంది.. సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ మొదలైంది. మెగా ఇమేజ్ నుంచి మెల్ల మెల్లగా పక్కకు వచ్చి తనకంటూ ఓ సొంత ఇమేజ్ సృష్టించుకుని ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. అందుకే ఆయన ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. నాగబాబు ట్వీట్ కి అల్లు అర్జున్ నేరుగా రియాక్ట్ అవుతారా, లేక ఫ్యాన్స్ సమాధానమే తన సమాధానం అంటూ సరిపెడతారా..? వేచి చూడాలి.

#pushpamovie #sukumar #chiranjeevi #telugucinema #telugucinemanews #pushpakesava #allu #allusnehareddy #alluarha #alluarjunwife #bunny #bunnywife

@boldbalutv

আরো দেখুন